PUBLICMEDIA, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:-
మహిళ దారుణ హత్య …
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అంబేద్కర్ సెంటర్లో లో చికెన్ షాప్ నిర్వాహిస్తున్ మహమ్మద్ మెహబూబ్ పాషా బార్య హబీబ్ బేగం (40) హత్యకు గురైంది.
ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో మంచినీళ్ళు తీసుకొని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తీ గొడ్డలితో నరకటం తో హబీబ్ బేగం అక్కడికక్కడే మృతి చెందింది.
దీనితో గుర్తుతెలియని ఆగంతకుడు పరరైయ్యాడు.
పోలీసుస్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు ఒక్కసారి గా భయందోలనకు గురైనారు.
మృతురాలు గత 15 ఏండ్లుగా భర్తతో కలిసి చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
హబీబ్ బేగం మృతి తో వీరి కుటుంభం లో విషాదం చోటు చేసుకుంది.
హత్య కు గల కారణాలను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక Ci శుకూర్ తెలిపారు.